శరీరంలోని నీటి శాతం తగ్గిపోకుండా ఉండటానికి నీరు ఎక్కువగా తాగాలి. మజ్జిగ, పెరుగు, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటి సహజ సిద్ధమైన పానీయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇంట్లోకి గాలి ధారాళంగా వచ్చేలా కిటికీలు, తలుపులు తెరిచి ఉంచండి. ఎండ తీవ్రతకు అడవుల్లోని లేదా బయట ఉండే పాములు, తేళ్లు వంటివి చల్లదనం కోసం ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మూలల్లో, చెప్పుల స్టాండ్ల దగ్గర తలుపుల చాటున తనిఖీ చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి.



