ఇక వెండి ధరలు కూడా పతనం అయ్యాయి. గురువారం కిలో వెండిపై రూ.5,000 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.2,75,000 ధరకు చేరుకుంది. తులం సిల్వర్ ధర రూ.2,750గా ఉంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో ధరలు పెరిగాయి. గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 1.85 శాతం అంటే రూ.2,885 తగ్గి రూ.1,53,1000 వద్ద ట్రేడ్ అవుతోంది. సిల్వర్ మే ఫ్యూచర్స్ 2.14 శాతం పడిపోయింది. అంటే రూ. 5,413 తగ్గి రూ. 2,47,700 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పతనం అయ్యాయి. ప్రస్తుతం ఒక ఔన్స్ గోల్డ్ ధర 4,833 డాలర్ల వద్ద ఉంది. ఒక ఔన్స్ సిల్వర్ ధర 75 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.



