గత మార్చి రెండో వారంలో పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండేది. ఆ సమయంలో రోజుకు సుమారు 5 లక్షల వరకు గ్యాస్ బుకింగ్లు నమోదయ్యాయి. కానీ సరఫరాలో జాప్యం జరగడం వల్ల పెద్ద ఎత్తున బ్యాక్లాగ్లు పేరుకుపోయాయి. అయితే, ప్రభుత్వం వినియోగదారులకు ధైర్యం చెప్పడమే కాకుండా, సరఫరాను క్రమబద్ధీకరించడంపై దృష్టి సారించింది. ఫలితంగా ఏప్రిల్ 4వ తేదీన (శనివారం) 2,11,302 మంది బుకింగ్ చేసుకోగా, అధికారులు ఏకంగా 2,77,367 సిలిండర్లను డెలివరీ చేశారు. అంటే కొత్తగా వచ్చిన ఆర్డర్లతో పాటు పాత బకాయిలను కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు.



