ఈ పథకం ద్వారా ఏపీలో లక్షల రేషన్ కార్డు హోల్డర్లు ఎంతో లాభపడతారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు రోజువారీ జీవితంలో చాలా సౌకర్యం పొందుతారు. “ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే మా ప్రధాన లక్ష్యం. రేషన్ మార్టులు ఆధునిక రూపంలో ఉంటాయి. సబ్సిడీ సరుకులు సులభంగా, ఎక్కువ వైవిధ్యంతో లభిస్తాయి” అని ఏపీ ఆహార, పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలో మూడు సర్కిళ్లలో పైలట్ ప్రాజెక్టు ద్వారా ప్రారంభమయ్యే ఈ మార్టులు విజయవంతమైతే ఇతర జిల్లాలు, నగరాలకు విస్తరించనున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే అన్ని సన్నాహాలూ పూర్తి చేసింది. రేషన్ కార్డు స్కాన్ చేసి సరుకులు తీసుకోవడం, ఆధునిక స్టోర్ లాంటి వాతావరణం వీటిలో ఉంటుంది. ఇది ప్రజల్లో భారీ అంచనాలను సృష్టిస్తోంది. ఇవి త్వరగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.



