Amaravati News: బ్రేకింగ్.. అమరావతిపై కేంద్రం చారిత్రాత్మక ప్రకటన! ఇక తిరుగులేదు.. చట్టబద్ధమైన రాజధానిగా ముద్ర! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

మోదీ సర్కార్ కీలక ప్రకటన. ఏపీ రాజధానిపై దశాబ్ద కాలపు సస్పెన్స్‌కు తెర.. గెజిట్ విడుదల!

Amaravati: బ్రేకింగ్.. అమరావతిపై కేంద్రం చారిత్రాత్మక ప్రకటన! ఇక తిరుగులేదు.. చట్టబద్ధమైన రాజధానిగా ముద్ర!
Amaravati: బ్రేకింగ్.. అమరావతిపై కేంద్రం చారిత్రాత్మక ప్రకటన! ఇక తిరుగులేదు.. చట్టబద్ధమైన రాజధానిగా ముద్ర!

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కొనసాగుతున్న దశాబ్ద కాలపు ఉత్కంఠకు తెరపడింది! ఢిల్లీ వేదికగా వెలువడిన ఒకే ఒక్క గెజిట్ నోటిఫికేషన్ ఏపీ భవిష్యత్తును మార్చేసింది. ఇకపై అమరావతి కేవలం ఒక నగరం కాదు.. చట్టబద్ధమైన ఏకైక రాజధాని! 2014 విభజన చట్టానికి కీలక సవరణలు చేస్తూ పార్లమెంట్ ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. దీనితో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) చట్టం-2026 అధికారికంగా అమలులోకి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక గెజిట్ విడుదల చేసింది.

ఈ చట్ట సవరణ ప్రకారం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 5లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో చట్టంలో “కొత్త రాజధాని ఉంటుంది” అని మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ స్థానంలో “అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది” అనే స్పష్టమైన పదాలను చేర్చారు. 2024 జూన్ 2వ తేదీ నుండే ఈ సవరణ అమలులోకి వచ్చినట్లు కేంద్రం గెజిట్‌లో పేర్కొంది. అంటే గత రెండేళ్లుగా జరిగిన పరిణామాలు అన్నింటికీ ఈ చట్టం పూర్తి రక్షణ కల్పిస్తుంది. రాజధాని విషయంలో ఉన్న అస్పష్టతను తొలగిస్తూ కేంద్రం ఈ తుది నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: Gold Price: బంగారం ప్రియులకు పిడుగు లాంటి సడన్ షాక్.. ఒక్కసారిగా భారీ కుదుపు.. గోల్డ్ మార్కెట్‌లో పెను విధ్వంసం! ఇక సీన్ సితారే..

అమరావతి అంటే కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) చట్టం-2014 కింద నోటిఫై చేసిన రాజధాని నగర ప్రాంతాలన్నీ అమరావతి పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు. దీనివల్ల గతంలో ఉన్న 29 గ్రామాలకు సంబంధించిన భూములు, సరిహద్దుల విషయంలో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా అడ్డుకట్ట పడింది. అమరావతి రాజధానిగా చట్టబద్ధత పొందడం వల్ల ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు మార్గం సుగమం అయ్యింది.

ఇది కూడా చదవండి: Food Prices: బియ్యం, నూనె, పప్పు, చక్కెర… 40 వస్తువుల ధరలపై మోదీ ప్రభుత్వం అదిరే గుడ్ న్యూస్.. యుద్ధం వేళ సామాన్యులకు భారీ ఊరట!

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతం ఇవ్వనుంది. రాజధానిపై స్పష్టత రావడంతో అంతర్జాతీయ పెట్టుబడులు తరలివచ్చే అవకాశం ఉంటుంది. ఐటీ కంపెనీలు, భారీ పరిశ్రమలు అమరావతి వైపు చూసే అవకాశం మెరుగుపడింది. గతంలో ఉన్న మూడు రాజధానుల ప్రతిపాదనకు ఈ సవరణ చట్టంతో పూర్తిస్థాయిలో తెరపడినట్లయింది. రాష్ట్ర అభివృద్ధి రథచక్రం ఇకపై అమరావతి కేంద్రంగానే వేగంగా ముందుకు సాగనుంది. ఇది రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం చేయడమే కాకుండా భవిష్యత్ తరాలకు భరోసా ఇస్తుంది.

ఈ చట్ట సవరణ బిల్లు నంబర్ 105-F (2026) ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత గెజిట్ ద్వారా బహిర్గతం చేశారు. న్యాయ శాఖ కార్యదర్శి డాక్టర్ రాజీవ్ మణి ఈ ప్రకటన విడుదల చేశారు. చట్టబద్ధమైన ఈ గుర్తింపు వల్ల కేంద్రం నుండి వచ్చే ఆర్థిక సాయం, గ్రాంట్ల విషయంలో రాష్ట్రానికి ప్రాధాన్యత పెరగనుంది. 77వ గణతంత్ర సంవత్సరంలో పార్లమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అమరావతి అభివృద్ధికి ఈ చట్టం ఒక గట్టి పునాదిగా పనిచేస్తుంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *