Akividu: ఆకివీడులో ఉద్రిక్తత.. రామాలయం వద్ద దాడి.. 57 మంది అరెస్ట్..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

ఆకివీడు రామాలయం వద్ద త్రిబుల్ ఆర్ అనుచరులపై దాడి ఘటన కలకలం రేపింది. 57 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, 144 సెక్షన్ అమలు.

+

త్రిబుల్

త్రిబుల్ ఆర్ సంచలనం రామాలయం కట్టి తీరతాం

ఆంధ్రప్రదేశ్‌లోని ఆకివీడు ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. రామాలయం పరిసరాల్లో జరిగిన ఘర్షణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శనివారం కూడా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో అధికారులు అక్కడ 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన ఐదుగురు సమీప ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారిని శాసనసభ డిప్యూటీ స్పీకర్ Raghurama Krishnam Raju పరామర్శించడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

రాములవారి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత సంచలనంగా మారింది. ముఖ్య అతిథిగా వచ్చిన రఘురామకృష్ణంరాజు కాన్వాయ్ ప్రాంతానికి చేరుకోగానే స్థానికులు, మహిళలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆ పరిస్థితుల్లోనే ఆయన ఆలయ దర్శనం పూర్తి చేసుకుని తిరిగి వెళ్లే క్రమంలో దాడులు జరిగినట్లు తెలుస్తోంది. త్రిబుల్ ఆర్ అనుచరులపై రాళ్ల దాడి జరిగిందని, కర్రలకు మేకులు కొట్టి కావాలనే దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఘటనపై స్పందించిన రఘురామకృష్ణంరాజు తీవ్రంగా స్పందించారు. ఇది ముందుగా పన్నిన కుట్ర అని, ఇలాంటి విద్వంస చర్యలను ప్రారంభంలోనే అణచివేయాల్సిన అవసరం ఉందని అన్నారు. చరిత్రపరంగా, పత్రాల ఆధారంగా అక్కడ రామాలయం ఉన్నదని స్పష్టమవుతోందని, ఏది ఏమైనా ఆ ప్రాంతంలో రామాలయం నిర్మాణం పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.

ఇక ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కూడా స్పందించారు. ఆకివీడు ఘటన తనను కలచివేసిందని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 57 మందిని అరెస్ట్ చేశారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆకివీడు ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉండటంతో, గుంపులు గుంపులుగా తిరగడం, సభలు సమావేశాలు నిర్వహించడం నిషేధించారు. పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.

మొత్తంగా చూస్తే, ఆకివీడు రామాలయం ఘటన ఒక ప్రాంతీయ వివాదం నుంచి రాష్ట్రస్థాయి చర్చకు దారి తీసింది. రాజకీయ, సామాజిక కోణాల్లో ఈ పరిణామాలు మరింత వేడెక్కే అవకాశమున్నాయి. అయితే ప్రస్తుతం పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *