విజయనగరం: విశాఖపట్నంలో జరిగిన 5వ రాష్ట్ర స్థాయి పారా సిట్టింగ్ వాలీబాల్ ఛాంపియన్షిప్లో విజయనగరం జిల్లా పురుష, మహిళల జట్లు రెండూ మొదటి స్థానంలో నిలిచాయి. ఈ పోటీల్లో మొత్తం తొమ్మిది మంది క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.
రాష్ట్ర స్థాయిలో రాణించిన ఈ క్రీడాకారులు హిమాచల్ ప్రదేశ్లో ఫిబ్రవరి 25 నుండి 28 వరకు జరిగే 14వ జాతీయ పారా సిట్టింగ్ వాలీబాల్ ఛాంపియన్షిప్లో పాల్గొంటారు. వీరిలో ఆరుగురు మహిళా క్రీడాకారులు, ముగ్గురు పురుష క్రీడాకారులు ఉన్నారు.
ఈ జట్లకు శ్రీను కోఆర్డినేటర్గా వ్యవహరిస్తూ శిక్షణ ఇచ్చారు. ఆయన పురుష జట్టుకు కెప్టెన్గా, హేమావతి మహిళా జట్టుకు కెప్టెన్గా నాయకత్వం వహించారు. సాధారణ రైతు కుటుంబాలకు చెందిన క్రీడాకారులు ఆర్థిక, శారీరక ఇబ్బందులను అధిగమించి విజయం సాధించడం గమనార్హం. మహిళా జట్టు కెప్టెన్ హేమావతి బీటెక్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ విజయం పారా సిట్టింగ్ వాలీబాల్ క్రీడకు జిల్లాలో మరింత ఊపునిచ్చింది.


