రైల్వే పనులతో ప్రయాణికులకు ముందస్తు హెచ్చరిక.. చిత్తూరు జిల్లాలో ఈ తేదీల్లో ఆ మార్గం బంద్..! Chittoor railway level crossing works traffic route change. | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

చిత్తూరు–పూతలపట్టు మధ్య రైల్వే లెవల్ క్రాసింగ్ నెం.22 వద్ద ఫిబ్రవరి 20, 2026 నుంచి మార్చి 1, 2026 వరకు ట్రాక్ అప్‌గ్రేడ్ పనులు, ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ డైవర్షన్.

చిత్తూరు మీదగా వెళ్లే రైల్వే ప్రయాణికులు  అలెర్ట్<br>
చిత్తూరు మీదగా వెళ్లే రైల్వే ప్రయాణికులు  అలెర్ట్

ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాగా ఉన్న చిత్తూరు జిల్లాలో రైల్వే ప్రయాణం నిత్యజీవితంలో భాగమైపోయింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సమీపంలో ఉండటంతో వేలాది మంది ప్రతిరోజూ రైలుపై ఆధారపడుతున్నారు. తక్కువ చార్జీ, సౌకర్యవంతమైన ప్రయాణం కారణంగా రైళ్లే ప్రధాన ఎంపికగా మారాయి. అయితే ఇప్పుడు చిత్తూరు పట్టణ పరిసరాల్లో చేపట్టనున్న కీలక రైల్వే పనుల కారణంగా ప్రయాణికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చిత్తూరు–పూతలపట్టు స్టేషన్ల మధ్య, మురుగంబట్టు సమీపంలో ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ నెం.22 వద్ద భారీ పనులు చేపట్టనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. భారీ రోడ్డు, రైలు రాకపోకల కారణంగా పట్టాలు, స్లీపర్లు దెబ్బతిన్నాయని, ప్రజా భద్రత దృష్ట్యా పూర్తి ట్రాక్ అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. చిన్న కొత్తూరు గ్రామం, పుణేపల్లి కాలనీ మీదుగా పెనుమూరు రోడ్డుకు వెళ్లే ఈ మార్గం అత్యంత రద్దీగా ఉండటంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

ఫిబ్రవరి 20, 2026 నుంచి మార్చి 1, 2026 వరకు ఈ పనులు కొనసాగనున్నాయి. ఈ కాలంలో లెవల్ క్రాసింగ్ వద్ద వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసి, ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించనున్నారు. ఈ నిర్ణయం పూర్తిగా ప్రజల భద్రత కోసమేనని అధికారులు స్పష్టం చేశారు. పనులు వేగంగా పూర్తి చేయడానికి తాత్కాలిక అసౌకర్యాన్ని భరించాలని కోరారు.

రైల్వే శాఖ ప్రకారం, ఈ అప్‌గ్రేడ్ పనులు పూర్తయిన తర్వాత రైలు ప్రయాణం మరింత సురక్షితంగా మారనుంది. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలుగా ఈ మార్పులు చేపట్టినట్లు వివరించారు. ప్రజలు ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకుని, సూచించిన డైవర్షన్ మార్గాలను ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే పనులు సకాలంలో పూర్తి అవుతాయని అధికారులు తెలిపారు. తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలను స్వాగతించాలని సూచించారు. చిత్తూరులోని ప్రయాణికులు, వాహనదారులు ఈ తేదీల్లో జాగ్రత్తగా ఉండడం అత్యంత అవసరం.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *