విశాలాంధ్ర – మల్కాజిగిరి : ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ ప్రశాంత్ నగర్లో రంజాన్ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా అందించిన ఈద్ కా తోఫాను కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు సత్యమూర్తి ముస్లిం సోదరులకు అందజేశారు. వారిని శాలువాతో సత్కరించి స్వీట్స్ అందజేసి, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి కట్టుబడి ఉందని, మల్కాజిగిరిలో మైనార్టీల అభ్యున్నతికి సహకరిస్తున్న మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రేమ్ కుమార్కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవాజ్, బషీర్, అజీమ్, కాజా, జగదీశ్వరరావు, లోకేష్, సంతోష్ను పాల్గొన్నారు.


