ప్రాణం తీసిన బైక్ పొగ.. ఒకే ఇంట్లో నలుగురు మృతి.. అన్నమయ్య జిల్లాలో విషాదం | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

Andhra Pradesh: బైక్ పొగ వల్ల ప్రాణాలు పోవడం ఎప్పుడైనా విన్నారా? అలాంటి ఘటన మన అన్నమయ్య జిల్లాలోనే జరిగింది. ఏకంగా నలుగురి ప్రాణాలు పోవడం అంటే మామూలు విషయం కాదు. పెను విషాదం. ఏం జరిగిందో తెలుసుకుందాం.

ప్రాణం తీసిన బైక్ పొగ
ప్రాణం తీసిన బైక్ పొగ

ఆంధ్రప్రదేశ్.. అన్నమయ్య జిల్లా.. పుంగనూరులో ఈ విషాదం జరిగింది. ద్విచక్రవాహనం (బైక్) నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే ఇంటిలో నలుగురు మృతి చెందారు. పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఈ విషాద ఘటన జరిగింది. పూర్తి వివరాలు చూద్దాం.

పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఓ వ్యక్తి తన బైక్ మైలేజీ తగ్గిపోవడాన్ని గమనించాడు. దాన్ని సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్తే.. వాళ్లు పరిశీలించి.. ఈ బైక్ పని అయిపోయింది. మైలేజ్ తగ్గిపోతూనే ఉంటుంది. ఇక బోర్ చేయించాల్సిందే అన్నారు. లేదంటే మాటిమాటికీ ఆగిపోతూ ఇబ్బంది పెడుతూ ఉంటుందని చెప్పారు. దాంతో అతను.. బోర్ చేయిస్తే.. మళ్లీ కొత్త బండిలా పనిచేస్తుంది అని భావించి.. చెయ్యమన్నాడు. వాళ్లు రెండ్రోజుల్లో బోర్ చేయించి ఇచ్చారు. దాంతో అతను ఆనందంగా ఇంటికి తీసుకెళ్లాడు. ఐతే.. సర్వీస్ వాళ్లు చెప్పిన ఓ విషయం.. ప్రాణాలు పోయేందుకు పరోక్ష కారణం అయ్యింది.

Carbon Monoxide Poisoning, Punganur Bike Tragedy, Family Dies Sleeping, Andhra Pradesh Accident, Annamayya District Death, Bike Bore Service, Overnight Exhaust Poisoning, కార్బన్ మోనాక్సైడ్ విషాదం, పుంగనూరు నలుగురు మృతి, బైక్ సర్వీస్ తప్పు, త్యాగరాజు వీధి ఘటన, అన్నమయ్య జిల్లా వార్త,

ప్రాణం తీసిన బైక్ పొగ

వాహనాన్ని ఇంటికి తీసుకెళ్లాక.. దాన్ని రాత్రంతా ఉంచాలి అని మెకానిక్ సూచించాడు. ఆ వ్యక్తి రాత్రి బండిని స్టార్టింగ్‌లో ఉంచాడు. తర్వాత కుటుంబం మొత్తం రాత్రి గడియ వేసుకొని నిద్రపోయింది. ఐతే.. వాళ్లు ఒక విషయం గమనించలేదు. ఆ బైక్ నుంచి రిలీజ్ అయిన పొగ మామూలు పొగ కాదు. విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్. అది ఓ క్షణం పీల్చితే.. ఏం కాదు గానీ.. ఆ ఫ్యామిలీ ఆ పొగను రాత్రంతా పీల్చినట్లైంది. బండి ఆన్‌లో ఉండటంతో.. కంటిన్యూగా దాని నుంచి పొగ.. ఇంట్లోకి వస్తూనే ఉంది. కానీ కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉన్నారు. తమకు తెలియకుండానే వారు ఆ పొగను పీల్చారు. నిద్రలోనే కన్నుమూశారని ప్రాథమికంగా తెలిసింది.

ఇవి కూడా చదవండి: Gold Prices: రూ.13,430 తగ్గిన బంగారం ధర. నగలు కొనవచ్చా? ఇంకా తగ్గుతుందా? నిపుణుల మాట

తెల్లారే సరికి ఆ కుటుంబం నిద్ర లేవలేదు. చుట్టుపక్కల వాళ్లు.. బైక్ ఆన్‌లోనే ఉండటం చూసి.. ఇదేంటి అనుకుంటూ.. తలుపు తట్టగా.. ఎవరూ స్పందించలేదు. కిటికీ నుంచి చూడగా.. లోపల పొగ ఉంది. ఆ తర్వాత గమనిస్తే.. అందరూ చనిపోయినట్లు కనిపించారు. దాంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి.. ప్రాథమిక ఎంక్వైరీ చెయ్యగా.. ఇదంతా తెలిసింది. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
మృతి చెందినారు వారి వివరాలు:

రామచంద్ర, వయసు 75 సంవత్సరాలు.

B. కార్తీక్, వయసు 15 సంవత్సరాలు

B. చందన, వయసు 7 సంవత్సరాలు

B. చరిత, వయసు 7 సంవత్సరాలు

ఇవి కూడా చదవండి: AP Lands: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త.. భూమి సబ్ డివిజన్ ఉచితం.. రైతులకు రూ.0 ఊరట!

ఇలా బైక్ నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్.. ఆ ఇంటిలో నలుగురు సభ్యుల ప్రాణాలూ తీసింది. ఇలా జరుగుతుందని వారు అస్సలు అనుకొని ఉండరు. కానీ రాత్రంతా బైక్ ఆన్‌లో ఉంచడం, దాని పొగ.. ఆ ఇంట్లోకే రావడం వల్ల ఈ విషాదం జరిగింది. ఇది చూసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రోడ్లపై వాహనాల పొగ పీల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని అనుకుంటున్నారు. కుటుంబం మొత్తం చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు లోతైన దర్యాప్తు చేస్తామని చెబుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *