పేదలకు గుడ్‌న్యూస్.. ఇక రెండేళ్లకే ఇళ్ల స్థలాల విక్రయం


పేదలకు ఇళ్ల స్థలాల విక్రయానికి అనుమతి, జోన్ల పునర్వ్యవస్థీకరణ, భారీ పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు సంస్కరణలకు ఆమోదం లభించింది.ఈ విషయాలను రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.

పేదలకు ఇళ్ల స్థలాల విక్రయానికి అనుమతి
ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ఇప్పటి వరకు 10 సంవత్సరాల తర్వాత మాత్రమే విక్రయించేందుకు అనుమతి ఉండేద.ఇప్పుడు ఈ నిబంధనను సవరించి, రెండేళ్ల తర్వాతే విక్రయించుకునే వీలును కల్పించారు.2024లో పొందిన స్థలాలను కూడా ఇప్పుడు అమ్ముకునే అవకాశం రావడంతో లక్షల మందికి ఇది ప్రయోజనకరంగా మారనుంది.

జోన్ల వ్యవస్థలో మార్పులు
ఉద్యోగ నియామకాలు, బదిలీల కోసం ఉన్న జోన్ల వ్యవస్థను పునర్వ్యవస్థీకరించారు. ఉమ్మడి 13 జిల్లాల ఆధారంగా ఉన్న నాలుగు జోన్ల స్థానంలో, ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల మేరకు ఆరు జోన్లు, రెండు మల్టీజోన్లు ఏర్పాటు చేశారు.

ప్రైవేటు యూనివర్సిటీలకు ప్రోత్సాహం

రాష్ట్రంలో మరిన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అనుమతిస్తూ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. యూనివర్సిటీ స్థాపనకు అవసరమైన భూమి, పెట్టుబడి పరిమితులను తగ్గిస్తూ, కానీ నియంత్రణలను కఠినంగా ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు.
భారీ పెట్టుబడులకు ఆమోదం
2024 జూన్ నుంచి ఇప్పటివరకు 16 ఎస్‌ఐపీబీ సమావేశాల్లో 260 ప్రాజెక్టులకు రూ.9.36 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం ఇచ్చారు. దీని ద్వారా 9.62 లక్షల ఉద్యోగాలు సృష్టి కానున్నాయి.

యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణ
యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తుల గడువును 2026 డిసెంబర్ 31 వరకు పొడిగించారు. ఇకపై ఈ ప్రక్రియలో సీసీఎల్‌ఏ నిర్ణయమే తుది నిర్ణయంగా ఉంటుంది.
మిత్తల్ స్టీల్ ప్లాంట్ గడువు పొడిగింపు
అనకాపల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ తొలి దశ పనుల గడువును 2029 నుంచి 2031 డిసెంబర్ వరకు పొడిగించారు. అనుమతుల్లో జాప్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులు
అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఇన్నోవేషన్ హబ్, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సెంటర్, క్వాంటమ్ సేఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి పలు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.
మొత్తం పెట్టుబడి వందల కోట్లలో ఉండనుంది.

గూగుల్ డేటా సెంటర్‌కు అనుమతులు
విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుకు సంబంధించిన భూమి కేటాయింపులు, షరతుల మార్పులకు ఆమోదం తెలిపారు.
సెమీకండక్టర్, ఐటీ ప్రాజెక్టులు
శ్రీసత్యసాయి జిల్లాలో రూ.10,239 కోట్లతో సెమీకండక్టర్ ప్రాజెక్టు, విశాఖలో ఐటీ పార్కులు, డేటా సెంటర్లు, కెబుల్ ల్యాండింగ్ స్టేషన్ వంటి పలు ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

ఇతర ముఖ్య నిర్ణయాలు
మార్కాపురం ప్రమాద బాధితులకు రూ.1.28 కోట్ల సాయం
వ్యవసాయ విద్యుత్ సరఫరా బాధ్యతలు ఏపీఆర్‌ఏపీఎల్‌కు
ఏపీఐఐసీ భూముల ధర నిర్ణయం
పలు పారిశ్రామిక ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు
మొత్తంగా ఈ మంత్రివర్గ సమావేశం ద్వారా సంక్షేమం, పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల పెంపుపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు స్పష్టమైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *