హైదరాబాద్: రామ్చరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలో ఓ ప్రత్యేక గీతాన్ని త్వరలోనే తెరకెక్కించ నున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే రామ్ చరణ్తో కలిసి ఆ పాటకు డ్యాన్స్ చేసే కథానాయకను ఎంపిక చేయడంపై చిత్ర బందం దష్టి పెట్టింది. ఇప్పటికే పలువురు కథానాయికల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా… తెలంగాణ తెలుగమ్మాయి మానస వారణాసి కూడా ఈ రేసులోకి వచ్చింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో ఆకట్టుకున్నారు మానస వారణాసి. చిత్రబృందం పరిశీలనలో ఆమె పేరు ఉన్నట్టు తెలుస్తోంది. ఫెమినా మిస్ ఇండియా 2020 విజేతగా నిలిచిందామె. రామ్చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ తెరకెక్కుతోంది. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి. తుదిదశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీపైన త్వరలోనే స్పష్టత రానుంది. కాగా పెద్దిలోని రెండు పాటలో ఇదివరకే విడుదల చేసిన చికిరి చికిరి, రై…రై…రారా పాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి.
The post ‘పెద్ది’ సినిమాలోకి మరో నాయిక? appeared first on Visalaandhra.


