బెంగళూరుః సుస్థిరమైన నీటిపారుదలలో ప్రపంచ అగ్రగామి ఆర్బియా ప్రెసిషన్ అగ్రికల్చర్లో భాగమైన నెటాఫిమ్తో కలిసి అమెజాన్ ఇండియా నేడు బెంగళూరు, హైదరాబాద్లలో కొత్త నీటి పొదుపు ప్రాజెక్టులను ప్రకటించింది. సంప్రదాయ వరద నీటిపారుదలని బిందు సేద్యంతో భర్తీ చేయడం ద్వారా ఈ ప్రాజెక్టులు సంవత్సరానికి 325 మిలియన్ లీటర్లకు పైగా నీటిని ఆదా చేస్తాయని భావిస్తున్నారు. బిందు సేద్యం నీటిని నేరుగా మొక్కల వేళ్ళకు అందిస్తుంది, పంట దిగుబడిని కొనసాగిస్తూ వథాను గణనీయంగా తగ్గిస్తుంది. భారతదేశంలోని నీటి bద్దడి ప్రాంతాలలో ఈ సాంకేతికత చాలా కీలకం, bందుకంటే ఇది రైతులు నీటిని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చేస్తుంది, పట్టణ సరఫరాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. 2027 నాటికి భారతదేశంలో వాటర్ పాజిటివ్గా మారాలనే అమెజాన్ విస్తత నిబద్ధతలో ఈ రెండు ప్రాజెక్టులు భాగం, అంటే కంపెనీ తన ప్రత్యక్ష కార్యకలాపాలలో ఉపయోగించే దానికంటే bక్కువ నీటిని కవ¶్యనిటీలకు తిరిగి ఇస్తుంది. ఓర్బియా నెటాఫిమ్ ఇన్నోవేషన్ అండ్ కెí్లమేట్ సొల్యూషన్స్ డైరెక్టర్ మాక్స్ మోల్డావ్స్కీ మాట్లాడుతూ, “కచ్చిత మైన నీటిపారుదల రైతులకు, కవ¶్యనిటీలకు నిజమైన ప్రభావాన్ని bలా అందించగలదో తెలియజేసే ఈ ముఖ్య మైన చొరవ అని అన్నారు. బెంగళూరు ప్రాజెక్టు 80 హెక్టార్ల పొలం, టమాటా పొలాలలో సంప్రదాయ వరద నీటిపారుదల స్థానంలో బిందు సేద్యం ద్వారా సంవత్సరానికి 175 మిలియన్ లీటర్లకు పైగా నీటిని ఆదా చేస్తుందని భావిస్తున్నారు. హైదరాబాద్ ప్రాజెక్టు దాదాపు 40 హెక్టార్ల మొక్కజొన్న, కూరగాయల తోటలలో సంప్రదాయ వరద నీటిపారు దల స్థానంలో బిందు సేద్యం ద్వారా సంవత్సరానికి 150 మిలియన్ లీటర్ల నీటిని ఆదా చేస్తుందని భావిస్తున్నారు. అమెజాన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సిం>ù ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ చొరవ నేలపై గణనీయమైన తేడాను కలిగించే ఆచరణాత్మక పరిష్కారాలపై దష్టి పెడుతుందన్నారు.


