దిల్లీ లిక్కర్ కేసు విచారణ వాయిదా


న్యూదిల్లీ: దిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ ఈడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ కేసును జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారించింది. ఈడీ తరఫున అదనపు సాలిసిటర్ జనరల్ ఏఎస్జీ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు. ట్రయల్ కోర్టు తన అధికార పరిధిని మించి కొన్ని వ్యాఖ్యలు చేసిందని, వాటిని తొలగించాలని న్యాయవాది వాదించారు. ఇదిలా ఉండగా, నాటికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు, పారదర్శకమైన రీతిలో మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మే 15న విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,500 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీజేస్తారు. అనంతరం ఆగస్టు 15న 91 గ్రూప్-1 పోస్టులు, హోం శాఖలో 2,778 పోలీస్ ఉద్యోగాలు, ఇతర శాఖల్లోని 928 ఖాళీలకు ప్రకటనలు విడుదల చేస్తారు. సెప్టెంబరు 15న… 750 గ్రూప్-2 పోస్టులతో పాటు 503 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టులు, ఇతర విభాగాల్లోని 506 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. అక్టోబరు 15న పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యా శాఖలకు చెందిన 3,004 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టనున్నారు. నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ… ఫలితాల వెల్లడి అంతా నిర్ణీత సమయానికే జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అభ్యర్థులందరూ అaఱజూuఅyaఎ.aజూ.స్త్రశీఙ.ఱఅ పోర్టల్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రి సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ద్వారా నిరుద్యోగుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించామని, అభ్యర్థులు క్రమశిక్షణతో కూడిన ప్రణాళికతో పోటీ పరీక్షలకు సిద్ధమై…ప్రభుత్వ సర్వీసుల్లో చేరాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *