యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర
విశాలాంధ్ర ధర్మవరం; దాతల సహాయ సహకారములతోనే అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర ,కార్యదర్శి జయరాం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు దాదాపు 250 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. నేటి ఈ అన్నదాన కార్యక్రమానికి షేక్ సికిందర్.. గ్లోబల్ ఆప్టికల్స్ వారి సౌజన్యంతో నిర్వహించడం పట్ల వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్ మాట్లాడుతూ పట్టణము, గ్రామీణ ప్రాంతాలలో యువర్స్ ఫౌండేషన్ వారు వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టి పట్టణంలోనే మంచి గుర్తింపు పొందడం సంతోషించదగ్గ విషయమని తెలుపుతూ వారికి ప్రభుత్వ ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు గర్రె రమేష్ బాబు, మాజీ కౌన్సిలర్ కే తా లోకేష్, మోహన, ఓవి.ప్రసాద్ దాతలు షేక్ సికిందర్ పాల్గొన్నారు.


