తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు ఉదయాన్నే చేరుకున్నారు. దీంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులను ఆయా కళాశాలల సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు.


