తిడితే ఊరుకునేది లేదు… : కేటీఆర్


అన్న ఎన్టీఆర్‌ను, ఆ తర్వాత చంద్రబాబు, వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్‌లను చూశామని, కానీ రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మనం చూడలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. హామీల గురించి అడిగితే తిడుతున్నారని, కానీ ఇంతమంది ముఖ్యమంత్రులను మనం చూసినా వారెవరూ ఇలా మాట్లాడలేదని అన్నారు.భూపాలపల్లి, పరకాలలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేయనని ముఖ్యమంత్రి చెబుతున్నారని, అసలు ఆయన రద్దు చేయడానికి, జిల్లాను ఆయన చేశాడా అని ప్రశ్నించారు. జిల్లాను రద్దు చేస్తే భూపాలపల్లి ప్రజలు వీపు చింతపండు చేస్తారని కేటీఆర్ అన్నారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిడితే ఊరుకునేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. ఁనీ టైమ్ అంతా రెండేళ్లే. ఆ తర్వాత గులాబీ జెండా ఎగురుతుంది. ఆ తర్వాత నువ్వు పాతాళంలో దాక్కున్నా వదిలి పెట్టం, పొట్టోడా. కేసీఆర్‌తో పాటు మా కార్యకర్తలను అంటే ఊరుకునేది లేదు అని అన్నారు. తిడితే తనను, ఇతర నాయకులను తిట్టుకోవచ్చని, కానీ కేసీఆర్‌ను, బీఆర్ఎస్ కార్యకర్తలను తిడితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఎంతమంది దేవుళ్లు ఉంటే అంతమంది దేవుళ్లను మొక్కుకున్నా అధికారంలోకి వచ్చాక వదిలి పెట్టేది లేదని అన్నారు. ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదని, లాగుల తొండల్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో పాలన పక్కకు పెట్టి కుంభకోణాలకు తెరలేపారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని విమర్శించారు.

సింగరేణిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బావమరిది కలిసి దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ప్రజలను ఆ పార్టీ నాయకులు ముంచుతారని హెచ్చరించారు. రూ.4 వేల పెన్షన్, తులం బంగారం, రైతుబంధు పెంపు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే హామీలు అమలవుతాయని ఓటర్లకు సూచించారు.

The post తిడితే ఊరుకునేది లేదు… : కేటీఆర్ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *