Last Updated:
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల ముందు, Kapileswaram పాఠశాలల్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతూ వీడ్కోలు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కావడానికి కేవలం రెండు రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఇన్నాళ్లు కలిసి చదివిన స్నేహితులు, ప్రేమగా మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులను వదిలి వెళ్లాల్సిన సమయం దగ్గరపడడంతో విద్యార్థులు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ సందర్భాన్ని గుర్తుగా నిలుపుకోవడానికి పలు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు విద్యార్థుల హృదయాలను తాకేలా, ఉపాధ్యాయుల ప్రేరణాత్మక సందేశాలతో నిండిపోయాయి.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని Kapileswaram మండల పరిధిలోని మాచర ఉన్నత పాఠశాలతో పాటు పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ వీడ్కోలు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాఠశాల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నో సంవత్సరాలు కలిసి చదివిన స్నేహితులు ఇకపై కనిపిస్తారో లేదో అన్న ఆలోచనతో విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమానికి ముందు విద్యార్థినులు సంప్రదాయం ఉట్టిపడేలా ట్రెడిషనల్ డ్రెస్సులతో హాజరై ఆటపాటలతో సందడి చేశారు. డాన్స్లు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. ఒకవైపు ఆనందం, మరోవైపు విడిపోవాల్సిన బాధ కలిసి విద్యార్థుల మనసుల్లో ప్రత్యేకమైన క్షణాలుగా నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన ఉపాధ్యాయులు పదో తరగతి పరీక్షలు జీవితంలో ఎంతో ముఖ్యమైన మలుపు అని వివరించారు. జీవితంలో తొలి విజయంగా పదో తరగతిని భావించాలని, ఈ దశలో కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవిస్తూ ఏకాగ్రతతో ముందుకు సాగాలని సూచించారు. మహానుభావులు చెప్పిన సూక్తులను సరదాగా కాకుండా సీరియస్గా తీసుకుంటే జీవితంలో పెద్ద విజయాలు సాధించవచ్చని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన విద్యార్థులకు చదువు ఎంతో పెద్ద ఆయుధమని, అదే భవిష్యత్తును ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. జీవితంలో సరదా అవసరమే అయినా, జీవితాన్నే సరదాగా మార్చుకోవద్దని, ముందుగా లక్ష్యంపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు. రానున్న పదో తరగతి పరీక్షల్లో ప్రతి విద్యార్థి మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. ఇలా ఆనందం, భావోద్వేగం, ప్రేరణలతో నిండిన ఈ వీడ్కోలు కార్యక్రమాలు విద్యార్థుల జీవితంలో చిరస్మరణీయ క్షణాలుగా నిలిచిపోయాయి. ఇక రెండు రోజుల తర్వాత ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల్లో విజయం సాధించాలని విద్యార్థులంతా సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


