విశాలాంధ్ర – మార్కాపురం : మార్కాపురం జిల్లా తొలి నూతన కలెక్టర్గా ఎం.విజయ సునీతను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రస్తుతం మార్కెటింగ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. డిసెంబర్ 30న ఏర్పాటు చేసిన నూతన మార్కాపురం జిల్లాకు తొలి కలెక్టర్గా 2014 బ్యాచ్ కి చెందిన మహిళా ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది గతంలోనే జాయింట్ కలెక్టర్ గా పులి శ్రీనివాసులను ప్రభుత్వ నియమించింది.


