విశాలాంధ్ర -ధర్మవరం;; మండల పరిధిలోని 20 గ్రామపంచాయతీలలో పరిశుభ్రతగా ఉండుటే మా లక్ష్యము అని ఎన్డీఏ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు, శాంతిరెడ్డి శ్రీనివాసులు, మహేష్ చేతుల మీదుగా 20 గ్రామ పంచాయతీలకు తోపుడుబండ్లను, తడి చెత్త, పొడి చెత్త వేరుగా వేసేందుకు ప్లాస్టిక్ డ్రమ్ములను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ పరిశుభ్రత ఉండేవిధంగా అధికారులు, సచివాలయ ఉద్యోగులు కృషి చేయాలని తెలిపారు. పరిశుభ్రత విషయంలో కూడా గ్రామ ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. పరిశుభ్రత ఉంటే అనారోగ్యం దరి చేరదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశు, ఏవో అబ్దుల్ నబీ, డిప్యూటీ ఎంపీడీవో సేక్షావలి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


