ఏపీలో ప్రతి ఇంటికి శుద్ధ నీరు.. 6 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన..! Andhra Pradesh municipal development. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు, ప్రతి ఇంటికి శుద్ధ నీటి కొళాయిలు, ఆరు నెలల్లో మున్సిపాలిటీ ఎన్నికలు, పిఠాపురం సమస్యల పరిష్కారం.

+

రాష్ట్రంలో

రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి సమీక్షలో మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ వ్యవస్థ అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తాజాగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రజలకు నేరుగా ఉపయోగపడే పలు ముఖ్య ప్రకటనలు చేశారు. ముఖ్యంగా ప్రతి ఇంటికి శుద్ధమైన మంచినీటితో కూడిన కొళాయి అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలను ఆరు నెలల్లోగా నిర్వహించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.

కాకినాడ జిల్లా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మున్సిపాలిటీలో ఈ సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా స్థాయి అధికారులతో కలిసి మంత్రి నారాయణ విస్తృతంగా చర్చలు జరిపారు. వేసవి కాలంలో ప్రజలకు ఎలాంటి మంచినీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని ఆయన భరోసా ఇచ్చారు.

ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించేందుకు ప్రత్యేకంగా నీటి కొళాయిల ఏర్పాటు చేపడుతున్నామని మంత్రి వివరించారు. పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, వీధి లైట్లు, నీటి సరఫరా వంటి మౌలిక వసతులను 100 శాతం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా పిఠాపురం పట్టణానికి సంబంధించిన సమస్యలను ప్రజలు, ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మాజీ ఎమ్మెల్యే వర్మ స్వయంగా సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించగా, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మున్సిపాలిటీ ఎన్నికలపై కూడా మంత్రి క్లారిటీ ఇచ్చారు. జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని వార్డుల సంఖ్య పెంచాలని ఎమ్మెల్యేలు కోరినట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే సర్వే ప్రారంభించారని, అది పూర్తయ్యిన వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న చిన్నపాటి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

ముఖ్యంగా వేసవి కాలంలో నీటి కొరత లేకుండా అన్ని మున్సిపాలిటీల్లో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, కూటమి నేతలు, మున్సిపల్ కమిషనర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ నిర్ణయాలతో రాష్ట్రంలో మున్సిపల్ పరిపాలనకు కొత్త దిశ లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *